సిక్కింలో ఎస్కేఎం (SKM) పార్టీకి మరోసారి అధికారం దక్కింది. 32 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 19 సీట్లతో మెజారిటీ మార్క్ ను గెలుచుకుంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని ఎస్కెఎం మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిక్కింసీఎం అసెంబ్లీ స్థానంలో ఎస్డిఎఫ్కు చెందిన సోమ్ నాథ్ పౌడియాల్పై 7,044 ఓట్ల తేడాతో విజయం సాధించారని ఈసీ అధికారి ఒకరు తెలిపారు