బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అవసరం లేని పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ భేటీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు పార్టీలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉందని అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ముమ్మాటికి ఒకే గూటి పక్షులని వారిని ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.