ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ డ్రెస్లో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 6న జిల్లాలోని స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యయ్యారు. స్కూల్ నుంచి ఆ బాలికలు ఇంటికి రాలేదు. వారికోసం తల్లిదండ్రులు గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అడవిలోని ఒక చెట్టుకు ఆ బాలికల మృతదేహాలు వేలాడుతుండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.