అయోధ్య సమీపంలో గతేడాది దళిత యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. దళిత యువతి కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆదివారం విలేకరుల సమావేశంలో విలపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.