ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. తాండా భానెడలో ఒక పార్టీకి చెందిన గేదె మరొకరి వీధిలోకి వెళ్లిందన్న విషయంపై ముస్లిం సైనీ వర్గానికి చెందిన రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరినొకరు కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా హరిద్వార్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కొత్వాలి మంగళూరు ఆదేశాలు జారీ చేశారు.