దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త ప్రకటించింది. ఈ క్రమంలో మరో కొత్త ప్యాక్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఎయిర్టెల్ కంపెనీ రూ. 49 డేటా ప్యాక్ మునుపటి కంటే ఎక్కువ డేటాను అందిస్తుంది. రూ. 49 రీఛార్జ్ ప్లాన్ తో యూజర్లు అపరిమిత డేటా ప్రయోజనం పొందుతారు. రూ. 49 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్తో మీకు 1 రోజు వాలిడిటీ లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్ FUP పరిమితి 20 GBతో వస్తుంది.