తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు
ఫీజుల భారం
తప్పడం లేదు. అంతర్జాతీయ, కార్పొరేట్, ద్వితీయ శ్రేణి కార్పొరేట్ పాఠశాలలను బట్టి ఫీజులను నిర్ణయిస్తున్నారు. ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు రూ.40 వేలు, ఒకటి నుంచి ఏడోతరగతి వరకు రూ.60 వేలు, ఏడు నుంచి పదోతరగతి వరకు రూ.80 వేలను వసూలు చేస్
తున్నారు. దీనికి తోడు పిల్లల ట్రాన్స్పోర్టు పేరుతో మరో రూ. 10,000 నుంచి రూ.20,000 వరకు దండుకుంటున్నారు. డ్రెస్సులు, టై, బెల్టులు, పాఠ్య, నోట్ పుస్తకాలు వీటిని అదనం.