కాలువలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి (వీడియో)

60చూసినవారు
యూపీలోని కాన్పూర్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్