తమిళనాడులోని వెల్లూరులో అదుపుతప్పిన ఓ కారు ఫుడ్ స్టాల్లోకి దూసుకెళ్లింది. ఈ నెల 11న కార్తీక్ అనే వ్యక్తి నిద్రమత్తులో కారు డ్రైవ్ చేశాడు. స్పీడ్ బ్రైకర్ను గమనించకుండా వేగంగా నడిపాడు. ఈ నేపథ్యంలో అదుపుతప్పిన ఆ కారు రోడ్డు పక్కగా ఉన్న ఈటరీలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సాయీషా అనే మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి ఆ ఫుడ్స్టాల్ లోపల పడింది. పోలీసుల కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరలయ్యింది.