హాథ్రస్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.
మృతులకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తీవ్ర సంతాపం తెలిపారు.
తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ‘ఇండియా’ కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.