982 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేసిన చంద్రబాబు

75చూసినవారు
982 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేసిన చంద్రబాబు
'చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో ఆయన అనుచరగణానికి 982 ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారు. వీటిని రద్దు చేయాలని అధికారులను ఆదేశించాం’ అని చంద్రబాబు వివరించారు. 'అధికారులను బెదిరించి పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్‌ భూములను వైసీపీ హయాంలో పెద్దలు చౌకగా కొనేశారు. ఇలాంటి భూములను పట్టాలు చేసుకున్నవారు జైలుకెళ్లడం ఖాయం.' అని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్