తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఈటల రాజేందర్కు దక్కనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానెల్తో ఆయన సోమవారం మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగుస్తోందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడి మార్పు త్వరలో ఉండబోతుందని, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.