తిరుపతి జిల్లాలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనకు దిగారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు రాత్రి 8.35 గంటలకు బయలుదేరాల్సిన స్పైన్ జెట్ విమానాన్ని రద్దు చేశారు. దీంతో తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా విమానాన్ని రద్దు చేయడంపై 65 మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.