ఐదుగురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినందుకు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ కోర్టు శుక్రవారం లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్పూత్ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు. ఈ వేధింపుల నేపథ్యంలో ఆయనకు బీజేపీ ఎంపీ టికెట్ను నిరాకరించింది.