పిల్లల్ని కనే ఉద్యోగం.. జీతం రూ.25 లక్షలు!

5811చూసినవారు
పిల్లల్ని కనే ఉద్యోగం.. జీతం రూ.25 లక్షలు!
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌‌లో ఓ కంపెనీ ఇటీవల ఇచ్చిన ప్రకటన సంచలనంగా మారింది. హుచెన్ హౌస్ కీపింగ్ అనే కంపెనీ మహిళలకు ఉద్యోగాలు ఆఫర్ చేసింది. 28 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలు సరోగేట్ మహిళలుగా మారితే రూ.25 లక్షల కంటే ఎక్కువ, 29-30 ఏళ్ల మహిళలకు రూ.25 లక్షలు, 40 ఏళ్ల మహిళలకు రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించింది. చైనాలో సరోగసీ నిషేధం. దీంతో ఈ కంపెనీ ప్రకటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్