ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. వీటి కొనుగోలుపై సబ్సిడీ ఇచ్చేందుకు ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS 2024)ను తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ స్కీమ్లో ఎలక్ట్రిక్ బైక్లకు గరిష్టంగా రూ.10వేల, ఎలక్ట్రిక్ త్రీవీలర్స్కు గరిష్టంగా రూ.50వేలు సబ్సిడీ అందుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి రానుందన్నారు.