భారతీయ మెడిసిన్స్ ను ప్రశంసించిన చైనా ఎంబసీ అధికార ప్రతినిధి

71చూసినవారు
భారతీయ మెడిసిన్స్ ను ప్రశంసించిన చైనా ఎంబసీ అధికార ప్రతినిధి
తన గొంతు నొప్పి, మెడ నొప్పులను సమర్థవంతంగా నయం చేశాయంటూ భారతీయ ఔషధాల పని తీరుపై ఇండియాలోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యూ జింగ్ ప్రశంసలు కురిపించారు. "సరసమైన ధరలోనే మంచి నాణ్యతతో కూడిన ఔషధాలు లభిస్తున్నాయి. ఇది అద్భుతం" అంటూ తాను తీసుకున్న మెడిసిన్స్ ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ "మా మందులు బాగుంటాయి" అని కామెంట్ చేశారు.

సంబంధిత పోస్ట్