సివిల్స్ ఫలితాల్లో యూపీలోని గోరఖ్పుర్కు చెందిన నౌషీన్ తొమ్మిదో ర్యాంకు సాధించారు. మూడో ప్రయత్నంలో ఆమె కల సాకారం అయ్యింది. ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ నుంచి సివిల్స్కు ఎంపికైన 31మందిలో ఈమె ఒకరు. తన విజయానికి స్నేహితులు, కోచింగ్ అకాడమీయే కారణమన్నారు. తన కలను సాకారం చేసుకోవడంలో స్నేహితులు ఎంతగానో సహకరించారని చెప్పారు. నౌషీన్ విజయంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.