తొమ్మిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు. సరిగ్గా ఇంటర్వ్యూ సమయంలో. క్యాన్సర్తో పోరాడుతూ ఇటీవల తల్లి ప్రాణాలు కోల్పోయింది. అంతటి విషాదకర పరిస్థితుల్లోనూ బాధను దిగమింగి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాడు. ఒడిశాకు చెందిన 24 ఏళ్ల అనిమేశ్ ప్రధాన్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. ’’రోజుకు 5- 6 గంటల పాటు చదివా. పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు’’ అని అనిమేశ్ తెలిపారు.