మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. ఒకరు మృతి

49224చూసినవారు
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. ఒకరు మృతి
మార్కుల విషయంలో తలెత్తిన వివాదం.. ఒకరి ప్రాణాల మీదికి వచ్చింది. కర్ణాటకలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. బెంగళూరులోని బనశంకరి పోలీసు ఠాణా పరిధిలో నివాసముండే పద్మజ (40) సోమవారం మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని తన కుమార్తె (17)ను ప్రశ్నించింది. ఆమె కోపంతో కత్తి తెచ్చి తల్లిని పొడిచింది. తల్లి కూడా మరో కత్తితో కుమార్తెపై ఎదురుదాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పద్మజను ఆసుపత్రిలో చేర్పించారు.

సంబంధిత పోస్ట్