ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నాలుగు ముఖ్యమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందులో భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ విప్లు సమాచారమిచ్చారు.