ఏపీ రాజధాని అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే.