మాజీ సీఎం కేసీఆర్కు CM రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. "డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి దళితులను ఆదుకున్నా అని చెబుతున్నావ్ కదా కేసీఆర్. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చావో అక్కడ నువ్వు ఓట్లు వేయించుకోవాలి. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో అక్కడ మేం ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు కేసీఆర్ సిద్ధమా?" అని ప్రశ్నించారు.