తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక నుంచి రోజు సచివాలయానికి రానున్నారు. గత రెండు నెలలుగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరిపాలన అంశాలకు సీఎం దూరంగా ఉన్నారు. సచివాలయానికి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలుతో పాటుగా విత్తనాల కొరత, వర్షాలు, వరదలకు సంబంధించిన వాటిపై చర్చించనున్నారు. రేపటి నుండి పెండింగ్లో ఉన్న అంశాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు.