తిరుమల కొండపై శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది. గురువారం శ్రీవారిని 62,161 మంది భక్తులు దర్శించుకోగా, 28,923 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.35 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.