ఆటో, లారీ ఢీ.. ఐదుగురికి గాయాలు

60చూసినవారు
ఆటో, లారీ ఢీ.. ఐదుగురికి గాయాలు
మన్యం జిల్లా పార్వతీపురంలోని వంతెనపై శుక్రవారం ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు వీరఘట్టం మండలం హుస్సేన్‌పురం వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్