సీఎం పేరు తప్పుగా ముద్రణ.. ఇద్దరిపై వేటు

12728చూసినవారు
సీఎం పేరు తప్పుగా ముద్రణ.. ఇద్దరిపై వేటు
తెలంగాణలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో సీఎం పేరు తప్పుగా ముద్రణ కావడంపై రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. అందుకు SCERT అడిషనల్ డైరెక్టర్ ఎం. రాధారెడ్డి, టెక్స్ట్ బుక్స్ ప్రెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారిని బాధ్యులుగా గుర్తిస్తూ బదిలీ వేటు వేసింది. పుస్తకాల్లో సీఎం రేవంత్ పేరుకు బదులుగా KCR పేరును ముద్రించారు. దీంతో 35 లక్షల పుస్తకాలు, వర్క్ బుక్స్ ముందు పేజీలను చింపి కేసీఆర్ పేరు కనపడకుండా వెనకాల అంటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్