త్వరలోనే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు స్టార్ హీరో విశాల్ ప్రకటించారు. 'త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతుల్లేవు. వారికి సేవ చేసి.. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా." అని చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో విశాల్ తెలిపారు.