ఇజ్రాయెల్పై డ్రోన్, క్షిపణి దాడి తమ లక్ష్యాలన్నింటినీ సాధించిందని ఇరాన్ సైన్యం ఆదివారం తెలిపింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహ్మద్ బఘేరీ తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా తమ లక్ష్యాలను సాధించామని.. దీనిని కొనసాగించాల్సినవసరం, ఉద్దేశం తనకు లేవని బఘేరీ వివరించారు.