విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి జరగడం, గుత్తిలో ఆయన కాన్వాయ్పైకి చెప్పు విసిరడం వంటి ఘటనల దృష్ట్యా నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు జగన్ బస్సు పరిసరాల్లోకి అనుమతిపై ఆంక్షలు విధించనున్నారు. అలాగే జగన్, జనానికి మధ్య బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచించారు. క్రేన్లు, భారీ గజమాలలు వద్దని.. బస్సులోనే ఉండి రోడ్ షో నిర్వహించాలన్నారు. సభల్లో ర్యాంప్ వాక్ వద్దని విజ్ఞప్తి చేశారు.