విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి డైరెక్ట్ విమాన సర్వీస్లు నడవనున్నాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటన విడుదల చేసింది. విజయవాడ, ముంబై మధ్య డైలీ విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ చొరవ వల్లే ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.