సిమెంట్‌ ధరలు పెంచిన సంస్థలు

62చూసినవారు
సిమెంట్‌ ధరలు పెంచిన సంస్థలు
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్‌ ధరలు పెరిగాయి. సిమెంటు ధరల్ని పెంచుతున్నట్లు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రామ్‌కో, ఏసీసీ, దాల్మియా భారత్‌, ఇండియా సిమెంట్స్‌ సహా ప్రధాన సిమెంట్‌ కంపెనీలు ధరల్ని పెంచినట్లు సమాచారం. 50 కేజీల సిమెంట్‌ బస్తాపై రూ.20-30 మేర ధర పెంచిందని జాతీయ మీడియా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడులో సవరించిన ధరలు అక్టోబర్ 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్