కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. పశ్చిమబెంగాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసేలా ఉన్నాయని పేర్కొంది. ‘రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు చేస్తూ.. బీజేపీపై కుట్ర పన్నుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భాష, ప్రాంతం ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీచేయాలని రాహుల్ కుట్ర పన్నుతున్న తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం’ అని బీజేపీ నేత తరుణ్ చుగ్ పేర్కొన్నారు.