ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదనీ.. తహసీల్దార్‌ వాహనం తగలబెట్టిన యువకుడు (వీడియో)

60చూసినవారు
కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం షాకింగ్‌ ఘటన జరిగింది. పృథ్వీరాజ్‌ అనే వ్యక్తి కోపంతో ఏకంగా తహసీల్దార్‌ వాహనాన్ని పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. అతడు గత జులైలో ఓ ట్రిప్‌కు వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించారు. కనిపించకుండా పోయిన కుమారుడు జులై 23న తిరిగొచ్చాడు. తల్లి ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని తెలుసుకున్న అతడు దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్