సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఆకాశంలో భారీ కుదుపునకు లోనైన ఘటనలో కొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు బ్యాంకాక్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కొందరికి మెదడు, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలను గుర్తించినట్లు తెలిపాయి. వీరిలో కొంతమందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మరణించారు.