ఆదిలాబాద్ నుంచి నేతల చేరికలపై కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఇటీవల గాంధీభవన్లో చేరికల కమిటీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి జాయినింగ్స్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు శుక్రవారం పార్టీ ప్రకటించింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. ఇక నుంచి పార్టీలో చేరికలన్నీ దీపాదాస్ మున్షి ఆదేశాల ప్రకారం మాత్రమే జరుగుతాయన్నారు.