డిసెంబరు 9నే రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ అంటూ రైతులను మోసం చేస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో 80శాతం దొడ్డు వడ్లనే పండిస్తారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి?. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉంది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి' అని ఫైర్ అయ్యారు.