తెలంగాణ ప్రజల ఆస్తుల్లో 50% లూటీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. జహీరాబాద్ బహిరంగ సభలో పీఎం మాట్లాడుతూ.. 'పదేళ్లలో దేశమెంత అభివృద్ది చెందిందో అంతా చూశారు. కాంగ్రెస్ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి చేస్తుంది. కాంగ్రెస్ పంచసూత్రాలు అంటే మాఫియా, కుటుంబ రాజకీయాలు. భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసింది' అని మండిపడ్డారు.