పశ్చిమబెంగాల్లోని డార్జీలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. మంత్రి రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారని, ప్రజల భద్రత గురించి చర్చించడానికి ఆయనకు సమయం లేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. గత పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం రైల్వేశాఖను పూర్తిగా దుర్వినియోగం చేసింది. తప్పులు చేయవద్దు అంటూ హితవు పలికింది.