నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం

1063చూసినవారు
నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం మంగళవారం ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు రెండు దఫాలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 82 మంది అభ్యర్థులను ప్రకటించింది. మూడవ జాబితాపై నేతలు కసరత్తు చేయనున్నారు. ఈ జాబితాను బుధవారం ప్రకటించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్