కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు స్వల్ప అస్వస్థత (వీడియో)

73చూసినవారు
కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆదివారం కథువాలో జరిగిన బహిరంగ సభలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఖర్గేకు కళ్లు తిరిగినట్లు తెలుస్తోంది. వెంటనే వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలు ఆయనకు సహకరించి మంచి నీళ్లు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. "నేను ఇంత త్వరగా చనిపోను, ప్రధాని మోడీని అధికారం నుండి తొలగించే వరకు నేను బతికే ఉంటాను" అని అన్నారు.

సంబంధిత పోస్ట్