తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. 'త్వరలోనే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించబోతుంది. నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదు. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రేవంత్పై 25 మంది MLAలు అసంతృప్తితో ఉన్నారు. మున్షీని రేవంత్ మేనేజ్ చేస్తున్నారని వారిని మార్చారు. త్వరలోనే రేవంత్ను కూడా తీసేస్తారు. అందుకే భయంతో రేవంత్ ఢిల్లీకి వెళ్లారు' అని అన్నారు.