రెండు గ్లాసుల విధానం, దళితులకి ఆలయ ప్రవేశం వంటి వివక్ష నేటికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న వాస్తవం. ఏపీలోని వంగర మండలం లక్షింపేటలో భూమి కోసం జరిగిన వివాదంలో పెత్తందారులు ఐదుగురు దళితులను హతమార్చారు. హైదరాబాద్లోని మనోహరాబాద్ ప్రాంతంలో డప్పు కొట్టడం వీలు కాదని చెప్పినందుకు ఒక దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం. చట్టాలున్నా.. వీరికి రక్షణ ఇవ్వడం లేదు.