జత్వానీ కేసులో పోలీసుల కుట్ర

85చూసినవారు
జత్వానీ కేసులో పోలీసుల కుట్ర
ఏదైనా ఘటన జరిగితే, పోలీసులు తొలుత కేసు పెట్టి, తర్వాత దర్యాప్తు చేయడం సహజం. జగన్‌ భక్త ఐపీఎస్‌లు మాత్రం నటి కాదంబరీ జత్వానీ వ్యవహారంలో అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబయికి విమాన టిక్కెట్లు బుక్‌ చేసుకుని, దొరికిపోయారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేశారు. అదే రోజు 11.30కి విమానంలో పోలీస్‌ల బృందం ముంబయికి వెళ్లింది. ఈ విమాన ప్రయాణం టికెట్లు ఫిబ్రవరి 1న బుక్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్