గోల్డెన్‌ టెంపుల్‌లో మనూ భాకర్ ప్రత్యేక ప్రార్థనలు‌ (Video)

81చూసినవారు
భారత షూటర్, పారిస్‌ ఒలింపిక్స్‌ డబుల్‌ మెడలిస్ట్‌ మనూభాకర్‌ అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించారు. శ్రీ హర్‌మందిర్‌ సాహిబ్‌గా పిలుచుకునే గోల్డెన్‌ టెంపుల్‌లో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భాకర్‌ వెంట ఆమె కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో మనూభాకర్‌ రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. దాంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచారు.

సంబంధిత పోస్ట్