భర్తపై గృహహింస కేసు పెట్టిన ఓ మహిళకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ కోర్టు ఇటీవల షాక్ ఇచ్చింది. ఆమె పెట్టిన కేసుకు, కోర్టులో వాదనలకు పొంతన లేకపోవడాన్ని న్యాయమూర్తి గమనించారు. దీంతో భర్తకు నెలకు రూ.5,000 భరణం ఇవ్వాలని ఆ మహిళను ఆదేశించారు. ఉజ్జయినికి చెందిన అమన్, ఆ మహిళ 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం భర్త తనను హింసిస్తున్నాడని, తల్లిదండ్రుల ఇంటికి ఆమె వెళ్లిపోయింది.