ఇరానీ కప్‌ విజేతగా ముంబై (వీడియో)

73చూసినవారు
ఇరానీ కప్ విజేతగా ముంబై నిలిచింది. రెస్టాఫ్‌ ఇండియా, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగుల ఆధిక్యం సంపాదించిన ముంబైని విజేతగా ప్రకటించారు. 27 ఏళ్ల తర్వాత ముంబై ఈ ట్రోఫీ సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఆ జట్టు 15వ సారి విజేతగా నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్