టీఎస్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్(సీపీగెట్) నోటిఫికేషన్ ఈనెల 15న విడుదల కానుంది. రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఏదైనా కోర్సులో 10 కంటే తక్కువ మంది చేరితే.. ఆ కోర్సును మూసివేయనున్నారు. గతేడాది విధించిన ఈ నిబంధనను ఈసారి కూడా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.