క్రాకర్స్ పేలి ముగ్గురు మృతి.. ధ్వంసమైన ఇళ్లు (వీడియో)

58చూసినవారు
తమిళనాడులోని తిరుప్పూర్లోని మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. పాండియన్ నగర్ లో అక్రమంగా తయారు చేసి నిల్వ ఉంచిన క్రాకర్లు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాద ఘటనలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. అంతేకాకుండా పరిసరాల్లో ఉన్న ఐదు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ క్రాకర్లు ఆలయ ఉత్సవాల్లో ఉపయోగిస్తునట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్