టీ 20 వరల్డ్ కప్-2024 విజేతగా
భారత్ నిలిచింది. శనివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో
భారత్ గెలిచింది. దీంతో కోట్లాది మంది భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద క్రికిట్ అభిమానులు భారీగా చేరుకుని బాణాసంచా కాలుస్తూ కేరింతలతో సంబరాలు చేసుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.